తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మిషన్ చాణక్య సర్వే రిపోర్టు
- బీఆర్ఎస్ పార్టీకే మరోమారు ప్రభుత్వ పగ్గాలు
- రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయ సేకరణ
- నాలుగు నెలల పాటు విస్తృతంగా సర్వే
- అధికార పార్టీకే 41.62 శాతం ప్రజల మద్దతు
ఈమేరకు నా రాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్లు మిషన్ చాణక్య వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి.. మరీ ముఖ్యంగా మేనిఫెస్టో విడుదల చేశాక మహిళల నుంచి భారీగా మద్దతు వ్యక్తమైందని తేలింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై 85 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 44.62 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.