ఇసుక పాలసీ పేరుతో జగన్ ప్రజలను దోచుకున్నారు: టీడీపీ నేత పట్టాభిరాం
- అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే దోపిడీ మొదలుపెట్టాడని ఆరోపణ
- ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్ ఇసుక రూ.1300 లకు దొరికేదన్న పట్టాభిరాం
- కొత్త పాలసీ వచ్చాక ఏడెనిమిది వేలకు పెరిగిందని విమర్శ
జగన్ తాబేదారుల దోపిడీని తట్టుకోలేక జనం గగ్గోలు పెట్టడంతో పారదర్శక పాలసీ పేరుతో టెండర్లు పిలిచి జయప్రకాశ్ పార్వెంచర్స్ కంపెనీకి కట్టబెట్టారని పట్టాభిరాం చెప్పారు. అయితే, ఈ రోజుకూ ఎవరికీ కూడా జయప్రకాశ్ కంపెనీ నుంచి ఒరిజినల్ బిల్లులు రావట్లేదన్నారు. ఎక్కడా ఆన్ లైన్ పేమెంట్లు జరగవని, అన్నిచోట్లా నగదు చెల్లింపులే జరుగుతున్నాయని వివరించారు. ఇందులో ఇక పారదర్శకత ఎక్కడున్నట్లు అంటూ పట్టాభిరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.