ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగితే ఇండియాలో తీవ్ర పరిణామాలు
- ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్థాన్పై తీవ్ర ప్రభావం
- వడదెబ్బ, గుండెపోటు సహా పలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం
- 220 కోట్లమందిపై తీవ్ర ప్రభావం
ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరగడం వల్ల దాదాపు 220 కోట్ల మంది అత్యంత తీవ్రమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల వడదెబ్బ, గుండెపోటుతోపాటు పలు అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు కనీసం ఒక్కడిగ్రీ పెరిగినా ప్రతి సంవత్సరం వందల కోట్ల మంది తీవ్రమైన వేడి, గాలిలో అధిక తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించింది. అప్పుడు వారు తమ శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబరుచుకోలేని పరిస్థితి వస్తుందని పేర్కొంది.