PM Modi: ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు.. ప్రధాని మోదీ రాసిన గార్బా వైరల్!

  • నవరాత్రి వేళ భక్తి సంద్రంలో మునిగిన భక్త జనం
  • మోదీ రాసిన గార్బాకు దివ్యకుమార్ గళం
  • అత్యద్భుత చిత్రీకరణ
A Garba penned by PM Modi on auspicious Navratri dawns

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ తొమ్మిది రోజులు దేశం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఇక తెలంగాణలో నిన్నటి నుంచే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. 

ఇక, ఉత్తరాదిలో నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ రాసిన గార్బా పాట యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. నవరాత్రి ఉత్సవాల కోసం తాను పాట రాశానంటూ స్వయంగా ప్రధాని ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ వీడియోను షేర్ చేశారు. దివ్యకుమార్ పాడిన ఈ పాటను అత్యద్భుతంగా చిత్రీకరించారు. 



More Telugu News