నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో టీడీపీ అధినేత
- వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం
- ఈ విషయమై తమకు ఇంకా ఆదేశాలు అందలేదన్న జైలు పర్యవేక్షణాధికారి
తొలి రిమాండ్ ముగిశాక చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్గానే హాజరయ్యారు. అప్పట్లో కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు. ఆ తరువాత కూడా వర్చువల్ విధానంలోనే టీడీపీ అధినేత న్యాయమూర్తి ముందు హాజరుకాగా జడ్జి ఆయన జ్యుడీషియల్ రిమాండ్ను అక్టోబర్ 5 వరకూ పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే.