హైదరాబాదులో డ్రమ్స్ మోగించిన నారా భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
- మోత మోగిద్దాం కార్యాచరణ విజయవంతం చేసిన నేతలు, కార్యకర్తలు
- హైదరాబాదులో తన నివాసంలో మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి
- సత్యమేవ జయతే అంటూ నినదించిన చంద్రబాబు అర్ధాంగి
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలందరికీ చేరుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయతీ కలిగిన నేత అని స్పష్టం చేశారు.. ఈ పోరాటంతో చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ నినదించారు. బాబుతో నేను ప్లకార్డును ప్రదర్శించారు.


