Janhvi Kapoor: మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను: జాన్వీ కపూర్

  • పదేళ్ల వయసులోనే తన ఫొటోలు మార్ఫింగ్ చేశారన్న జాన్వీ
  • స్కూల్లో కంప్యూటర్ స్క్రీన్ పై ఆ ఫొటోలు చూశానని వెల్లడి
  • ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయన్న నటి
Janhvi Kapoor talks about photo morphing

అతిలోక సుందరి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ ల కుమార్తెగా సినీ రంగప్రవేశం చేసిన జాన్వీకపూర్ కెరీర్ లో క్రమంగా ఎదుగుతోంది. సినీ తార కాబట్టి సహజంగానే జాన్వీపై కూడా పుకార్లు వస్తుంటాయి. మరింత అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటోందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఫొటో మార్ఫింగ్  సమస్యను కూడా ఈ బ్యూటీ ఎదుర్కొందట. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ వీటన్నింటి గురించి స్పందించింది. ముఖ్యంగా, ఫొటో మార్ఫింగ్ అంశాన్ని ప్రస్తావించింది.

"అప్పుడు నాకు పదేళ్లుంటాయి. స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ లో నా క్లాస్ మేట్ కంప్యూటర్ స్క్రీన్ పై నా ఫొటోలు చూసి నిర్ఘాంతపోయాను. ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయి. దాదాపు పోర్నోగ్రఫీ సైట్లలో ఉండే ఫొటోల్లా అనిపించాయి. దాంతో నా ఫ్రెండ్స్ నావైపు అదోలా చూడడం మొదలుపెట్టారు. అంతేకాదు, వ్యాక్సింగ్ చేయించుకోలేదా అంటూ ఆటపట్టించారు" అని జాన్వీ గుర్తుచేసుకుంది.

More Telugu News