అర్నాబ్ గోస్వామితో లోకేశ్ ఇంటర్వ్యూ అదుర్స్: రఘురామకృష్ణరాజు

  • అర్నాబ్ గోస్వామి డిబేట్ లో లోకేశ్ చాలా బాగా మాట్లాడారన్న రఘురాజు
  • పప్పు అన్న వాళ్లకు తుప్పు వదిలిపోయిందని ఎద్దేవా
  • ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక అజ్ఞాని అని విమర్శ
రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి నిర్వహించిన డిబేట్ లో టీడీపీ యువనేత నారా లోకేశ్ మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. అర్నాబ్ ప్రశ్నిస్తుంటే ఖలేజాగా, షంషేర్ గా, తడుముకోకుండా లోకేశ్ సమాధానాలు చెప్పారని తెలిపారు.  మొన్నటిదాకా పప్పు, పప్పు అని ఏడ్చారు... ఇప్పుడు తుప్పు వదిలిపోయిందా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి అర్నాబ్ ఇంటర్వ్యూ చూస్తే... లోకేశ్ లో ఒక గొప్ప నాయకుడిని ప్రతి ఒక్కరూ చూస్తారని అన్నారు. తన వాక్పటిమతో లోకేశ్ ఎంతో నిజాయతీగా మాట్లాడారని రఘురామ కితాబునిచ్చారు. 






More Telugu News

Raghu Rama Krishna Raju Nara Lokesh Telugudesam Arnab Goswami