Nandamuri Ramakrishna: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకపోయారు: నందమూరి రామకృష్ణ

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రులో టీడీపీ నేతల నిరసన దీక్ష
  • హాజరైన నందమూరి రామకృష్ణ
Nandamuri Ramakrishna attends protest in Pamarru

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రులో టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే చంద్రబాబుపై కేసులు నమోదు చేశారని విమర్శించారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతోనే కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. 

నాడు యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు విజన్ స్కిల్ డెవలప్ మెంట్ అయితే... జగన్ విజన్ కిల్ డెవలప్ మెంట్ అని నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అరాచకాలను ప్రజలతో కలిసి ఎదుర్కొంటామని అన్నారు.

More Telugu News