భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 528 పాయింట్లు లాభపడి 67,127కి చేరుకుంది. నిఫ్టీ 176 పాయింట్లు పెరిగి 19,996కి ఎగబాకింది. యుటిలిటీస్, టెలికాం, పవర్ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.18%), యాక్సిస్ బ్యాంక్ (1.99%), మారుతి (1.96%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.49%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.39%). 

మరోవైపు ఎల్ అండ్ టీ 0.27 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.22 శాతం నష్టపోయాయి.
Go Back to Shorts
Stock Market
sense
Nifty

More Telugu News