బీజేపీలో వెయ్యి దాటిన ఎమ్మెల్యే ఆశావహుల దరఖాస్తులు
- 4వ తేదీన ప్రారంభమైన ఎమ్మెల్యే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఐదు రోజుల్లో వెయ్యి దాటిన జాబితా
- టిక్కెట్ కోసం చెన్నమనేని, జితేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి దరఖాస్తు
వేములవాడ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఈ రోజు చెన్నమనేని వికాస్ రావు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దరఖాస్తు చేశారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ కోసం ఏనుగు రాకేశ్ రెడ్డి ఆసక్తి చూపారు. కాగా, సీనియర్ నేతలైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉందని తెలుస్తోంది.