Stock Market: స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

Markets ends in profits
  • 333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 93 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.65 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 333 పాయింట్లు లాభపడి 66,599కి చేరుకుంది. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 19,820 వద్ద స్థిరపడింది. ఇన్ఫ్రా, రియాల్టీ, కన్జ్యూమర్ గూడ్స్ తదితర సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.65%), టాటా మోటార్స్ (2.02%), ఎల్ అండ్ టీ (1.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.42%), భారతీ ఎయిర్ టెల్ (1.02%). 

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-0.79%), ఐటీసీ (-0.71%), విప్రో (-0.58%), టెక్ మహీంద్రా (-0.54%), టాటా స్టీల్ (-0.46%).
Stock Market
Sensex
Nifty

More Telugu News