తెలంగాణ ఎన్నికలు.. కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ
- కమ్యూనిస్టులను దూరం పెట్టిన కేసీఆర్
- కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న కామ్రేడ్లు
- సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చర్చలు సఫలమయినట్టు చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో సీపీఎం జాతీయ నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చలు చేయనున్నారు. ఇంకోవైపు సీపీఐ, సీపీఎం పార్టీలకు గెలవగలిగిన స్థానాల్లో చెరొక సీటు కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. అయితే కమ్యూనిస్టులు చెరో మూడు సీట్లను కోరుతున్నట్టు తెలుస్తోంది. చివరకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.