టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోని వీహెచ్, రేణుకాచౌదరి
- 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగింపు
- దరఖాస్తు చేసుకోని సీనియర్ నేతల్లో జానారెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్
- సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ తనయుడు ఆదిత్యరెడ్డి
ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎల్బీ నగర్ నుండి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి ఇద్దరు తనయులు దరఖాస్తు చేశారు. సనత్ నగర్ నుండి మర్రి శశిధర్ తనయుడు ఆదిత్యరెడ్డి దరఖాస్తు చేశారు.