Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 267 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 83 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం నష్టపోయిన జియో ఫైనాన్స్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 65,216కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 19,393కి చేరుకుంది. పవర్, ఇన్ఫ్రా, మెటల్, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.70%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.06%), భారతి ఎయిర్ టెల్ (1.85%), ఎన్టీపీసీ (1.63%), ఐటీసీ (1.31%). 

టాప్ లూజర్స్:
జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (-5.00%), రిలయన్స్ (-1.50%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.87%), మారుతి (-0.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.28%).

More Telugu News