Mahesh Babu: గుంటూరు కారంపై వస్తున్న పుకార్లకు మహేశ్​ బాబు చెక్​

  • వచ్చే సంక్రాంతికే విడుదల అవుతుందన్న సూపర్ స్టార్
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
  • హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీలీల, మీనాక్షి చౌదరి
Mahesh Babu clears rumors about Guntur karam

మహేశ్ బాబు–త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. హీరోయిన్‌ పూజా హెగ్డే తప్పుకోవడం, ఇటీవల ఛాయగ్రాకుడి మార్పు వరకూ ఈ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తుంది. షూటింగ్ ఆగిపోయిందని, వచ్చే సంక్రాంతికి విడుదల కష్టమేనన్న పుకార్లు వస్తున్నాయి. వీటికి హీరో మహేశ్ బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. 

నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ‘గుంటూరు కారం’ గురించి మాట్లాడారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందన్నారు. ఆ రోజు ప్రేక్షకులంతా ఆనందంగా ఉంటారని స్పష్టం చేశారు. దాంతో, సినిమాపై పుకార్లు, అనుమానాలకు తెర పడింది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

More Telugu News