అజేయంగా ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో టీమిండియా జోరు
- సెమీస్లో 5–0తో జపాన్పై ఘన విజయం
- రేపు మలేసియాతో ఫైనల్ ఫైట్
భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డు గోడగా నిలవడంతో జపాన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్లో మలేసియా 6–2తో కొరియాను ఓడించింది. కాగా, ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి కాగా.. మలేసియాకు మొదటిసారి. భారత్ ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచింది.