ఫేస్ బుక్ లవ్: అంజూ వీసా గడువు పొడిగించిన పాక్ ప్రభుత్వం
- ఈ నెల 20 తో ముగియనున్న వీసా గడువు
- తొలుత రెండు నెలలు ఆపై ఏడాది పాటు పొడిగింపు
- మతం మారి నస్రుల్లాను పెళ్లాడిన రాజస్థానీ మహిళ
రాజస్థాన్ కు చెందిన అంజూకు భారత్ లో భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు నస్రుల్లా కోసం ఏకంగా దేశం దాటి వెళ్లింది. టూరిస్టు వీసా సంపాదించి వాఘా బార్డర్ గుండా పాకిస్థాన్ లోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడిని కలుసుకోవడంతో పాటు పాక్ ను చూడాలని వచ్చినట్లు చెప్పిన అంజూ.. రెండు రోజుల్లోనే మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకుని నస్రుల్లాను పెళ్లాడింది. మరోవైపు, అంజూ మొదటి భర్త జైపూర్ లో పోలీస్ కేస్ పెట్టాడు. తనకు విడాకులివ్వకుండా అంజూ చేసుకున్న రెండో పెళ్లి చెల్లదని, ఆమెతో పాటు నస్రుల్లాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఫాతిమా (అంజూ), నస్రుల్లాలపై జైపూర్ లో పోలీస్ కేస్ నమోదైంది.