'గుంటూరు కారం'లో మరో మార్పు.. ఈసారి సినిమాటోగ్రాఫర్
- పీఎస్ వినోద్ స్థానంలో మనోజ్ పరమహంస
- మహేశ్ బాబు–త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా
- హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి దీక్షిత్
విజయ్ జోసెఫ్ నటించిన తమిళ చిత్రం 'బీస్ట్' కి కూడా పని చేశాడు. ప్రస్తుతం విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న 'లియో', గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న 'ధ్రువ నచ్చతిరం' (తెలుగులో ధ్రువ నక్షత్రం) సినిమాలకు కూడా పని చేస్తున్నారు. కాగా, వినోద్ స్థానంలో మనోజ్ను తీసుకున్నట్టు 'గుంటూరు కారం' చిత్ర బృందం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడో వారంలో మొదలవనుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.