ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ 'వందేభారత్' ఎక్స్‌ప్రెస్

Kachiguda yashwantpur vandebharat express to be launched on 6th of august
తెలుగు ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. 

నంద్యాల జిల్లా డోన్ మీదుగా వెళ్లే ఈ రైలు ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయలుదేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది. ప్రస్తుతం అధికారులు ఈ రైలును స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం-5పై నిలిపి ఉంచారు. ఆరోజు ప్రధాని మోదీ దీనిని ప్రారంభించడంతో పాటు, అమృత్ భారత్ స్టేషన్లు మల్కాజిగిరి, మలక్‌పేట, ఉప్పుగూడ, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్‌లో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
Go Back to Shorts
Vande Bharat
Telangana
Andhra Pradesh
South Central Railway

More Telugu News