Bandi Sanjay: ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తా: ఢిల్లీలో బండి సంజయ్

  • నడ్డాకు శాలువా కప్పి సన్మానించిన కరీంనగర్ ఎంపీ
  • తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న బండి సంజయ్
  • కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా
Bandi Sanjay meets JP Nadda in Delhi

అధిష్ఠానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ నేత బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నడ్డాకు శాలువా కప్పి సన్మానించారు. ఈ నెల ప్రారంభంలో బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుండి సంజయ్‌ని తప్పించి, కిషన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బండి సంజయ్‌కు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నేపథ్యంలో నేడు పార్టీ సీనియర్ నేత రాధమోహన్ అగర్వాల్‌తో కలిసి నడ్డాను కలిశారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణలో తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News