రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వార్తలపై ఏపీ డీజీపీ స్పందన
- ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డీజీపీ
- మిస్ అయిన మహిళల్లో 23 వేల మందిని ఇప్పటికే గుర్తించామని వెల్లడి
- 30 వేల మంది మిస్ అయినట్టు కొందరు తప్పుడు లెక్కలు చెపుతున్నారని విమర్శ
రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని గంజాయితో ముడిపెట్టడం సరికాదని డీజీపీ అన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఏజెన్సీలో గత ఏడాది 7 వేల ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశామని తెలిపారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒడిశా నుంచి రవాణా అవుతోందని అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టామని చెప్పారు.