Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 351 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 351 పాయింట్లు లాభపడి 66,707కి చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 19,778కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.30%), ఐటీసీ (2.14%), సన్ ఫార్మా (1.70%), రిలయన్స్ (1.84%), యాక్సిస్ బ్యాంక్ (1.45%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.29%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.29%), టెక్ మహీంద్రా (-0.84%), ఏసియన్ పెయింట్స్ (-0.83%).

More Telugu News