సీఎం జగన్ కు క్షమాపణ చెపుతున్నా: వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్
- పిల్లి బోస్, మంత్రి చెల్లుబోయిన మధ్య కోల్డ్ వార్
- చెల్లుబోయినకు టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న బోస్
- వైసీపీని వీడుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్య
ఈ క్రమంలో మీడియాతో పిల్లి బోస్ మాట్లాడుతూ... కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లినప్పుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని చెప్పారు. వైసీపీని వీడుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ఎంతో బాధతో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ కు తాను క్షమాపణలు చెపుతున్నానని తెలిపారు.