రైల్వే సిబ్బంది పొరపాటు..400 మంది ప్రయాణికులకు ఊహించని షాక్

రైల్వే సిబ్బంది పొరపాటుతో ఏకంగా 400 మంది ప్రయాణికులు ఇక్కట్ల పాలైన ఘటన రేణిగుంట రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైళ్లు ఒక ప్లాట్‌ఫాంకు బదులు మరో ప్లాట్‌ఫాంకు వస్తాయని చెప్పడంతో వారందరూ రైళ్లు మిస్ అయ్యారు. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌వైపు వెళ్లే రైళ్లు 5వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు రావాల్సి ఉంది. అయితే, అవి 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తాయని సిబ్బంది పొరపాటున ప్రకటించడంతో ప్రయాణికులంతా అక్కడికి చేరుకున్నారు. ఈలోపు ఆ రెండు రైళ్లు 5వ నంబర్ ప్లాట్‌ఫారానికి వచ్చి వెళ్లిపోయాయి. జరిగింది తెలిసి లబోదిబోమనడం ప్రయాణికుల వంతైంది.

Renigunta Railwaystation
Tirupati
South Central Railway

More Telugu News