తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
- తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి
- తొమ్మిది గంటలకు సెలవు ప్రకటించడంపై పేరెంట్స్ ఆగ్రహం
చాలామంది విద్యార్థులు ఇప్పటికే వర్షంలో తడుస్తూ స్కూల్ కి వెళ్లారని తల్లిదండ్రులు ఆగ్రహంతో ట్వీట్ చేశారు. ఉదయం 7:30 గంటలకు వర్షంలో తడుస్తూనే పిల్లలను స్కూల్ లో దింపేసి వచ్చామని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మీరు తీరిగ్గా 9 గంటలకు స్కూళ్లకు సెలవంటూ ట్వీట్ చేస్తే ఏంలాభమని నిలదీస్తున్నారు. వర్షాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం లేదని పేరెంట్స్ విమర్శిస్తున్నారు.