CM Jagan: కాస్త ఆలస్యంగా తండ్రికి నివాళులు అర్పించిన సీఎం జగన్... తనయుడ్ని ఆప్యాయంగా ముద్దాడిన విజయమ్మ

  • నేడు వైఎస్సార్ జయంతి
  • అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్
  • పర్యటన అనంతరం ఈ సాయంత్రం ఇడుపులపాయ రాక
  • సీఎం జగన్ వెంట విజయమ్మ
CM Jagan pays tributes to his late father YS Rajasekhar Reddy at Idupulapaya estate

నేడు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. సీఎం జగన్ కాస్త ఆలస్యంగా తండ్రికి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లాలో పర్యటన అనంతరం సీఎం జగన్ ఈ సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్నారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం తండ్రిని స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. 

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట ఆయన తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. జగన్ వైఎస్ సమాధి వద్దకు రాగానే విజయమ్మ తనయుడ్ని ఆప్యాయంగా ముద్దాడారు. ఈ ఉదయం విజయమ్మ కుమార్తె షర్మిలతో పాటు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం తెలిసిందే. 

More Telugu News