లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 340 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం వరకు పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
నిన్న ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ భారీగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు లాభపడి 65,786కి చేరుకుంది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 19,497 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.79%), టాటా మోటార్స్ (2.12%), రిలయన్స్ (1.60%), ఎన్టీపీసీ (1.60%).  

టాప్ లూజర్స్:
మారుతి (-1.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.23%), బజాజ్ ఫైనాన్స్ (-1.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.76%), టాటా స్టీల్ (-0.22%).

Stock Market
Sensex
Nifty

More Telugu News