Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 486 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 133 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • రెండున్నర శాతం పెరిగిన రిలయన్స్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు లాభపడి 65,205కి పెరిగింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 19,322 కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (2.53%), ఐటీసీ (2.50%), బజాజ్ ఫైనాన్స్ (2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.20%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.76%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.86%), సన్ ఫార్మా (-1.83%), మారుతి (-1.12%), ఎల్ అండ్ టీ (-0.91%), టీసీఎస్ (-0.88%).

More Telugu News