Simhachalam: సింహాచలంలో కొనసాగుతున్న గిరిప్రదక్షిణ.. భక్తజన సంద్రంతో కిక్కిరిసిన సింహాద్రి గిరులు

  • నిన్న సాయంత్రం మొదలైన గిరి ప్రదక్షిణ
  • తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాక
  • గోవింద నామస్మరణతో మార్మోగుతున్న సింహాద్రి గిరులు
Simhachalam Giri Pradakshina Continuous

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, ఒడిశా నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. 

గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గాలు మార్మోగుతున్నాయి. ఈ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పాతగోశాల టీ జంక్షన్ వద్ద రద్దీ మరింత ఎక్కువగా కనిపించింది. వరాహ లక్ష్మీనరసింహస్వామిని స్మరించుకుంటూ భక్తులు ముందుకు సాగుతున్నారు.

More Telugu News