నడ్డా సభకు ఈటల, కోమటిరెడ్డి దూరం.. బీజేపీకి గుడ్బై ఖాయమేనా?
- కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఈటల, కోమటిరెడ్డి
- కాంగ్రెస్లో చేరికకు సిద్ధమైనట్టు సమాచారం
- ‘బండి’ తీరుతోనే నేతలు పార్టీ వీడుతున్నారని విమర్శలు
- కాంగ్రెస్లోకి క్యూ కడుతున్న నేతలు
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీరు కూడా పార్టీకి నేతలు దూరమవడానికి కారణంగా చెబుతున్నారు. అందరినీ కలుపుకెళ్లకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడడం ఖాయమని చెబుతున్నారు. పొంగులేటి, జూపల్లి ఇప్పటికే కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం సిద్ధం కాగా, ఇప్పుడు ఈటల, కోమటిరెడ్డి, జితేందర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటి బీజేపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.