Road Accident: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి దుర్మరణం

  • కారును ఢీకొట్టిన టిప్పర్
  • సంఘటన స్థలంలోనే మృతిచెందిన వ్యక్తులు
  • మృతుల్లో ఇద్దరు మహిళలు
  • మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తింపు
  • సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన
Four died in road accident

హన్మకొండ జిల్లాలో ఇవాళ రహదారి నెత్తురోడింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్... కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News