ప్రపంచంలోని అలాంటి అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటి: హరీశ్రావు
- మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఆర్థిక శాఖ మంత్రి
- రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని వెల్లడి
- దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు హరిత ఉత్సవం నిర్వహిస్తున్న ప్రభుత్వం
హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,864 నర్సరీలను, 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పునరుద్ధరించామని తెలిపారు. ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలను నాటామన్నారు. సీఎం కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తే సమగ్ర, స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తారని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రభుత్వం ఏం చేయాలో ప్రపంచానికి తెలంగాణ సగర్వంగా చాటిచెప్పిందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని మంత్రి ట్వీట్ చేశారు.