Visakhapatnam District: ‘అమిత్ షా గారూ.. వైజాగ్‌ను కాపాడండి’ అంటూ విశాఖపట్నంలో పలుచోట్ల పోస్టర్లు

  • జన జాగరణ సమితి ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల పోస్టర్లు
  • విశాఖలో భూకబ్జాలు, ఇతర నేరాలు పెచ్చుమీరుతున్నాయని జన జాగరణ సమితి కన్వీనర్ వాసు ఆందోళన
  • హోం మంత్రి స్వయంగా కల్పించుకుని నగరాన్ని రక్షించాలని వినతి
Jana janagaran samithi posters in vizag seeking amitshat intervention to save the city

విశాఖపట్నంలో జన జాగరణ సమితి పలుచోట్ల ‘అమిషా గారూ.. విశాఖను రక్షించండి’ అని రాసున్న పోస్టర్లు ఏర్పాటు చేసింది. నగరంలో భూకబ్జాలు, గనులు, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగ్ తదితర నేరాలు పెచ్చుమీరుతున్నాయని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో భూములకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. భూ కబ్జాలు, గంజాయి గురించిన వార్తలు తరచూ వింటున్నామని విచారం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులను రెండు రోజుల పాటు నిర్బంధించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు విశాఖ అడ్డాగా మారిందని గతంలో వ్యాఖ్యానించిన హోంమంత్రి అమిత్ షాయే నగరాన్ని కాపాడాలని ఆయన కోరారు.

More Telugu News