Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

  • అంబడోల సమీపంలో ఘటన
  • పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు చెందిన నాలుగు బోగీలు 
  • ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న రైల్వే అధికారులు
  • ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం లేదని స్పష్టం
Four wagons of goods train derail in Odisha

ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాయగడ్ జిల్లాలోని అంబడోల సమీపంలో గూడ్స్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రత్యేక రూట్లో  ప్రయాణిస్తున్నందున ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని వెల్లడించారు. విషయం తెలియగానే రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పడానికి గల కారణాలను ఆరా తీసే పనిలో ఉన్నారు. ఈ గూడ్స్ రైలు అంబడోలా నుండి ప్రత్యేక రూట్ లో లాంజీగర్ వేదాంత లిమిటెడ్ ప్లాంట్ కు వెళుతోంది.

More Telugu News