జులై 14న వస్తున్న ఆనంద్ దేవరకొండ ‘బేబీ’
- ప్రధాన పాత్రల్లో విరాజ్, వైష్ణవి చైతన్య
- సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం
- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా
సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే టీజర్తో పాటు మూడు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ డేట్ను ప్రకటించింది. జులై 14న ఇది విడుదల అవుతుందని తెలిపింది. త్వరలోనే నాలుగో పాటను విడుదల చేస్తామని వెల్లడించారు.