ఒక్క బంతికి 18 పరుగులు.. టీ20 చరిత్రలోనే అత్యధిక ఖరీదైన చివరి బంతి
- టీఎన్ పీఎల్ లీగ్ లో అభిషేక్ తన్వార్ పేలవ బౌలింగ్
- ఆఖరి బంతి పూర్తి చేసే క్రమంలో మూడు నోబాల్స్, వైడ్ వేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
సూపర్ గల్లీస్ ఆఖరి ఓవర్లో తొలి ఐదు బంతులకు ఎనిమిది పరుగులు ఇచ్చిన అభిషేక్ ఆఖరి బంతి వేసేందుకు ఇక్కట్లు పడ్డాడు. తొలుత అతను వేసిన బంతికి బ్యాటర్ సంజయ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, అది నో బాల్ అయింది. ఆ తర్వాత కూడా నోబాల్ వేయగా బ్యాటర్ సిక్సర్ కొట్టాడు. మూడో ప్రయత్నంలోనూ నోబాల్ వేయగా.. డబుల్ తీశాడు. తర్వాత వైడ్ వేసిన అభిషేక్ ఎట్టకేలకు సరైన బంతి వేయగా మరో సిక్సర్ వచ్చింది. మొత్తంగా చివరి బంతి కోసం ఏకంగా ఐదు డెలివరీలు వేయగా 18 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.