నారా లోకేశ్ పై వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శలు

YS Avinash Reddy fires on Nara Lokesh
  • వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించడానికే కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడన్న అవినాశ్
  • ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడని మండిపాటు
  • రాయలసీమ బిడ్డ అనే విషయం లోకేశ్ కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుందని ఎద్దేవా
కడప జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేవలం కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించడానికే ఆయన కడప జిల్లాలో పాదయాత్ర చేసేందుకు వచ్చినట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. లోకేశ్ అన్నీ అబద్ధాలే చెపుతున్నారని మండిపడ్డారు. సాధారణంగా తండ్రి నుంచే పిల్లలకు నాయకత్వ లక్షణాలు వస్తాయని... లోకేశ్ కు మాత్రం తండ్రి నుంచి అబద్ధాలు చెప్పే అలవాటు వచ్చిందని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ, విమర్శలు చేస్తూ పోతున్నారని అన్నారు. 

తాను కూడా రాయలసీమ బిడ్డనే అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై అవినాశ్ స్పందిస్తూ... రాయలసీమవాసిననే విషయం లోకేశ్ కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప ఈ ప్రాంత బిడ్డననే విషయం గుర్తులేనట్టుందని అన్నారు. తండ్రీకొడుకులను రాయలసీమ ప్రజలే కాకుండా, రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు కూడా నమ్మరని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
YS Avinash Reddy
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News