బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కేసీఆర్ సన్నిహితుడు.. కాంగ్రెస్ లో చేరే అవకాశం!
- బీఆర్ఎస్ కు కూచాడి శ్రీహరిరావు రాజీనామా
- బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తోందని విమర్శ
- తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీనే అని వ్యాఖ్య
2007లో శ్రీహరిరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చురుకుగా వ్యవహరించిన ఆయన... కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అంతేకాదు, ఆదిలాబాద్ జిల్లా బహిరంగసభల్లో మాట్లాడినప్పుడల్లా శ్రీహరి రావుతో తనకు ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా శ్రీహరి వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విధులను నిర్వర్తించారు.
తన రాజీనామా గురించి శ్రీహరి రావు మాట్లాడుతూ... రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు. ఇలాంటి మోసాలు ఇష్టం లేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని... ప్రజలు ఆమెకే మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.