అనాథ పిల్లలకు 'ఆదిపురుష్' సినిమా టికెట్లు ఇస్తున్న మంచు మనోజ్ దంపతులు
- అనాథ పిల్లల కోసం 2500 టికెట్ల బుక్
- ఈ నెల 16న విడుదల కానున్న చిత్రం
- క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని 1103 గ్రామాలలో ఒక్కో రామాలయానికి 101 టికెట్లు బుక్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు లక్ష పైచిలుకు టికెట్లను బుక్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా చేరారు. ఆదిపురుష్ 2500 టికెట్లను బుక్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనాథ పిల్లలకు చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంచు మనోజ్–మౌనిక దంపతుల నుంచి ప్రకటన వచ్చింది. కృతీ సనన్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించిన ఆదిపురుష్ సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించారు. విదేశాల్లోనూ ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్రభాస్ యూఎస్ఏ వెళ్లినట్టు తెలుస్తోంది.