కేసీఆర్ ప్రజలను కలవకపోవడంపై కేటీఆర్ ఏం చెప్పారంటే..!
- ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తనదాకా వస్తుందని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్
- తెలంగాణలో సంస్కరణలు తీసుకు వచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చారన్న మంత్రి
- ఎవరిస్థాయిలో వారు పని చేస్తే సీఎం వరకు రావాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్య
ప్రభుత్వ యంత్రాంగం సామాన్యులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. వారితో నెరవేరని సమస్యలు, జటిలమైనవి ఉంటే సీఎం వరకు రావాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎవరి స్థాయిలో ఎవరి పనిని వారు సరిగ్గా చేస్తే సీఎం వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. దేశంలోనే తెలంగాణ ఈ-గవర్నెన్స్ లో ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.