Rajasthan: సోదరి చితి మంటల్లో దూకిన యువకుడు... పరిస్థితి విషమం!

  • రాజస్థాన్‌లోని భివారా జిల్లాలో గురువారం ఘటన
  • ఆసుపత్రిలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యువకుడు
  • 95 శాతం గాయాలతో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితుల్లో లేడన్న పోలీసులు
Man jumps onto cousin sisters funeral pyre

ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ చితి మంటల్లోకి దూకిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో గురువారం 25 ఏళ్ల యువకుడు సుఖ్ దేవ్ భిల్ మంటల్లోకి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతను ఆసుపత్రిలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతను మంటల్లోకి దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు అతనిని బయటకు తీసి, ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. అతను ఎందుకు అలా చేశాడో తెలియాల్సి ఉంది. 

భివారా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా ఈ ఘటనపై మాట్లాడారు. సుఖ్ దేవ్ భిల్ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వర్గాలు తమకు సమాచారం అందించాయని చెప్పారు. 95 శాతం కాలిన గాయాలతో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అతను తన వాంగ్మూలాన్ని ఇచ్చే పరిస్థితుల్లో లేడన్నారు.

More Telugu News