పార్లమెంటు భవనం డిజైన్ శవపేటికలా ఉందన్న ఆర్జేడీ.. తీవ్రంగా స్పందించిన బీజేపీ
- శవపేటిక, పార్లమెంటు భవనం ఫొటోలను షేర్ చేసిన ఆర్జేడీ
- ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమన్న ఆర్జేడీ నేతలు
- అలా పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న బీజేపీ
- వచ్చే ఎన్నికల్లో అదే శవపేటికలో జనం మిమ్మల్ని పాతిపెడతారన్న బీజేపీ నేత గౌరవ్ భాటియా
ఈ ట్వీట్పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. 2024లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హెచ్చరించారు.