పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీకి షాకివ్వనున్న ప్రతిపక్షాలు!
- ప్రారంభోత్సవాన్ని ఉమ్మడిగా బహిష్కరించే యోచనలో ప్రతిపక్షాలు
- కార్యక్రమానికి హాజరు కాబోమని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ ప్రకటన
- భావసారూప్యత గల ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం
- బుధవారం ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటనకు అవకాశం
ప్రారంభోత్సవానికి తాము హాజరుకావడం లేదని తృతమూల్ కాంగ్రెస్, సీపీఐ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాలని ప్రతిపక్షాల యోచనగా ఉంది. ఇందు కోసం భావసారూప్యత కలిగిన పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పార్లమెంటు భవనం కేవలం ఒక నిర్మాణం కాదని, అది దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని తృణమూల్ నేత, ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ ఇప్పటికే పేర్కొన్నారు. ఇది ప్రధాని సొంత వ్యవహారం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, 2020లో భవన నిర్మాణ శంకుస్థాపనకూ ప్రతిపక్షాలు హాజరుకాని విషయం తెలిసిందే.