కేంద్రం ఆర్డినెన్స్పై ‘ఆప్’కు మద్దతుగా కాంగ్రెస్
- సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వారం రోజులకే కేంద్రం ఆర్డినెన్స్
- అధికారుల బదిలీలను చెప్పుచేతల్లోకి తీసుకున్న కేంద్రం
- ఆర్డినెన్స్పై పోరాటంలో కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం
పోలీసులు, పబ్లిక్ ఆర్డర్, భూమికి సంబంధించిన వాటిని మినహాయించి ఢిల్లీలో సేవల నియంత్రణను ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికే అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, ఆ తర్వాత వారం రోజులు కూడా గడవకముందే కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాకిచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేజ్రీవాల్ సర్కారు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆర్డినెన్స్పై పోరాడుతున్న కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. కొత్త ఆర్డినెన్స్ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఓడిన వారి చర్య కాక మరోటి కాదని తూర్పారబట్టారు.