ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి సూచీలు
- ప్రాఫిట్ బుకింగ్, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావం
టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు స్టాక్స్ లాభాల్లో ముగియగా, ఐటీసీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలు ఫ్లాట్ గా, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా వినియోగ ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 76 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 24 పైసలు క్షీణించి 82.04 వద్ద ముగిసింది.