మేం కనీసం 141 సీట్లు గెలవడం ఖాయం: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్
- ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే
- 1978లో విజయం సాధించినట్లే ఈసారి లోక్సభ ఎన్నికలకు తలుపులు తెరుస్తామని వ్యాఖ్య
- బీజేపీ మేనిఫెస్టోపై శివకుమార్ ఆగ్రహం
బీజేపీ తమ మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంశాల్ని చేర్చడంపై ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీకి ఒక స్పష్టమైన అజెండా లేదన్నారు. మోదీ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇక్కడ పని చేయదన్నారు. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి తమ పార్టీ నేతలం అందరం ఏకతాటిపై ఉన్నామన్నారు. పార్టీ గెలుపు తమ తొలి ప్రాధాన్యత అన్నారు.