270 ఎకరాల్లో గల్లా జయదేవ్ అమరరాజా గిగా ఫ్యాక్టరీ.. శంకుస్థాపన చేసిన కేటీఆర్
- మహబూబ్ నగర్ జిల్లాలో రూ. 9,500 కోట్ల పెట్టుబడితో అమరరాజా ఫ్యాక్టరీ
- తెలంగాణలో ఇదే తొలి గిగా ఫ్యాక్టరీ
- మిత్రుడు గల్లా జయదేవ్ కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
మరోవైపు అమరరాజా గిగా ఫ్యాక్టరీపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈవీ, సస్టెయినబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఇదొక పెద్ద అడుగు అని కేటీఆర్ ప్రశంసించారు. రూ. 9,500 కోట్లతో ఈ గిగా ప్లాంట్ ను నిర్మిస్తున్నారని వెల్లడించారు. భారత్ లో ఈ రంగంలో ఇదొక భారీ పెట్టుబడి అని అన్నారు. మహబూబ్ నగర్ కు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ అని చెప్పారు. గిగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు తన మిత్రుడు గల్లా జయదేవ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.