ట్రాక్పై ఇన్స్టా రీల్స్.. హైదరాబాద్లో రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం
- సనత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- 16 ఏళ్ల సర్ఫరాజ్ అనే విద్యార్థి మృతి
- త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు విద్యార్థులు
ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు సర్ఫరాజ్ అనే విద్యార్థిని ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకున్నారు. సమాచారం రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మృతుడు రహ్మద్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటున్నాడు.