అదానీ విల్మర్ లాభాలు రూ.234 కోట్ల నుండి రూ.94 కోట్లకు డౌన్
- ఏడాది ప్రాతిపదికన 60 శాతం తగ్గిన అదానీ విల్మర్ లాభాలు
- ఆదాయంలో కూడా 7 శాతం క్షీణత
- FY23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.582 కోట్ల ప్రాఫిట్ నమోదు
2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ.58,185 కోట్లు కాగా, లాభం రూ.582 కోట్లుగా నమోదయింది. FY23లో ఈ కంపెనీ సేల్స్ 5 మిలియన్ మెట్రిక్ టన్నులను క్రాస్ చేసింది. వీట్, రైస్.. ఈ రెండింటి వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లు దాటింది. ఎడిబుల్ ఆయిల్ రంగంలో 8 శాతం వృద్ధి నమోదయింది. అదానీ విల్మర్ అన్ని కేటగిరీల వ్యాల్యూమ్ పెరుగుదల 3 శాతంగా నమోదయింది.
FY23లో ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ రెవెన్యూ రూ.4000 కోట్లుగా నమోదయిందని, ఏడాది ప్రాతిపదికన 39 శాతం వృద్ధిని నమోదు చేసిందని, వ్యాల్యూమ్ పరంగా 55 శాతం పెరిగిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎడిబుల్ ఆయిల్స్ బ్రాండెడ్ సేల్స్ వ్యాల్యూమ్ 4 శాతం పెరిగినట్లు వెల్లడించింది. కాగా, హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.